తప్పు చేస్తే దొరకక తప్పదు

Mar 28 2024, 12:58

Justice NV Ramana: రాజధాని నిర్మాణం కోసం రైతులు త్యాగం చేశారు: మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ

కృష్ణా జిల్లా: విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్న సుప్రీంకోర్టు (Supreme Court) మాజీ ప్రధాన న్యాయమూర్తి (Former Chief Justice) జస్టిస్ ఎన్వీ రమణ ( Justice NV Ramana)కు విజయా డెయిరీ ఛైర్మన్ చలసాని ఆంజనేయులు (Chalasani Anjaneyulu), మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధనరావు (Dasari Balavardhana Rao), అమరావతి మహిళలు (Amaravati Womens), రైతులు (Farmers) ఘన స్వాగతం పలికారు..

ఈ సందర్భంగా మాజీ సీజేఐకు అమరావతి రైతులు, మహిళలు.. వినతిపత్రం అందజేశారు. జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ అమరావతి మహిళా రైతులు తమ కష్టాలు చెప్పారని, ప్రస్తుత ప్రభుత్వ విధానాల వలన1563 రోజులు నుంచి ఉద్యమం చేస్తున్నామని రైతులు వెల్లడించారన్నారు. రాజధాని నిర్మాణం కోసం రైతులు త్యాగం చేశారని, రాజధాని అమరావతి శంకుస్థాపనకు తాను కూడా వచ్చానని చెప్పారు.

రైతుకు భూమికి ఉన్న సంబంధం తల్లి బిడ్డకు ఉన్న సంబంధం లాంటిదని, రైతు భూమి కోల్పోవడం సామాన్యమైన విషయం కాదని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. గత ఐదు సంవత్సరాలుగా రైతులు భూములు ఇచ్చి నేరస్థుల్లా కోర్టులో నిలబడి అష్ట కష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైన ప్రభుత్వాలు మేల్కొని రైతులకు న్యాయం చేస్తారని అనుకుంటున్నానన్నారు. వాళ్లకు న్యాయ వ్యవస్థ కూడా పనిచేస్తుందని విశ్వసిస్తున్నానన్నారు. ఆలస్యం అయినప్పటికీ తప్పక న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాని.. వారి ఉద్యమ విజయవంతం కావాలని కోరుకుంటున్నానని జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Mar 28 2024, 12:55

టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్

టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్ అయ్యారు. సీఎం జగన్ సభ దగ్గర ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మేమంతా సిద్ధం పేరుతో జగన్ రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టారు..

ఇందులో భాగంగా ఇవాళ ఆయన నంద్యాల జిల్లాలో పర్యటిస్తున్నారు. నంద్యాలలో వైసీపీ బహిరంగా సభ ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో వైసీపీ సభ దగ్గరకు వెళ్లిన అఖిల ప్రియ సాగునీటి విడుదల కోసం సీఎం జగన్కు వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించారు. ఆమెతో పాటు టీడీపీ శ్రేణులు సైతం భారీగా తరలివెళ్లారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే అఖిలప్రియను, టీడీపీ శ్రేణులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. అఖిలప్రియను పోలీసులు అదులోకి తీసుకోవడంతో కాసేపు అక్కడి ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఇరువర్గాలను సముదాయించారు. వినతిపత్రిం ఇచ్చేందు వస్తే అరెస్ట్ చేయడమేంటని తెలుగు తమ్ముళ్లు పోలీసుల తీరుపై ఫైర్ అవుతున్నారు. ఈ సందర్భంగా అఖిలప్రియ మాట్లాడుతూ.. అపాయిట్మెంట్ కోసం ప్రయత్నిస్తే సీఎంవో స్పందించలేదని తెలిపారు. అందుకే నేరుగా సీఎంను కలిసి వినతి పత్రం ఇద్దామని వచ్చానన్నారు. వినతిపత్రం ఇస్తే శాంతిభద్రతల సమస్య ఎలా అవుతోందని ప్రశ్నించారు..

తప్పు చేస్తే దొరకక తప్పదు

Mar 28 2024, 12:54

భర్తను కొట్టి చంపిన భార్య

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ లో ఈరోజు దారుణం జరిగింది. భర్తను కట్టేసి కొట్టి చంపింది ఓ భార్య. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా సుభాష్ నగర్ లో గురువారం జరిగింది.

రోజు తాగి వచ్చితరచు గొడవ చేస్తున్నాడని నెపంతో భర్త హేమంత్ ని చంపింది భార్య రోహితి. పడుకున్న భర్త పై వేడి నీళ్ళు పోసిన భార్య రోహితి….

అనంతరం కొట్టడంతో తీవ్ర గాయాలతో జిల్లా ఆస్పత్రిలో చేరిన తర్వాత భర్త హేమంత్ చికిత్స పొందుతూ తెల్లవారు జామున మృతిచెందాడు. 

కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రి లో కాంట్రాక్టు పారిశుద్ధ కార్మికురాలుగా పనిచేస్తోంది రోహితి. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు 3 టౌన్ పోలీసులు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Mar 28 2024, 12:20

మంథని బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా హరిబాబు నియామకం

మంథని బార్ అసోసియే షన్ అధ్యక్షుడిగా బుధ వారం కెవిఎల్ఎన్ హరి బాబు ఈ ఎన్నికతో పదవసారి ఎన్నికయ్యారు.

మంథని బార్ అసోసియే షన్ ప్రధాన కార్యదర్శిగా ముస్కుల సహేందర్ రెడ్డి, ఉపాధ్యక్షుడిగా రఘోతం రెడ్డి, సహాయ కార్యదర్శిగా విజయ్ కుమార్, కోశాధి కారిగా అంజనేయులు, లైబ్రరీ కార్యదర్శిగా ఆర్ల నాగరాజు, సాంస్కృతిక కార్యదర్శిగా కటకం శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నిక య్యారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Mar 28 2024, 11:28

రైల్వే ట్రాక్ పై ప్రేమ జంట ఆత్మహత్య

బాసర రైల్వే ట్రాక్ పై ప్రేమ జంట ఆత్మహత్య కలకలం లేపింది.బుధవారం రాత్రి నాగర్సోల్ నుండి నర్సాపూర్ వెళ్లే ట్రైన్ కింద పడి ప్రేమ జంట ఆత్మహత్య కు పాల్పడింది.

మృతురాలు నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన యువతిగా గుర్తించారు. నిషిత డిగ్రీ కాలేజీలు చదువుతున్నట్లు ఐడి కార్డు ద్వారా తెలుస్తోంది.

మృతుడి వివరాలు తెలియ రావడం లేదు. రైల్వే పోలీసు లు ఘటన స్థలానికి చేరుకొ ని మృతదేహాలను స్వాధీ నం చేసుకొని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Mar 18 2024, 10:44

ప్రధాని మోడీపై ఈసీ కి ఎంపీ ఫిర్యాదు

ప్రధాని నరేంద్ర మోడీపై ఎన్నికల సంఘానికి TMC రాజ్యసభ సభ్యుడు సాకేత్ గోఖలే సోమవారం ఫిర్యాదు చేశారు.

రాజకీయ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఎయిర్‌ ఫోర్స్ హెలికాప్టర్‌ను ఉప యోగించి, ఎన్నికల నియ మావళిని ఉల్లంఘించారని ఆయన ఆరోపించారు.

ప్రధాని మోదీపై తాను చేసిన ఫిర్యాదు కాపీని గోఖలే సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఈ కారణంగానే 1975లో మాజీ ప్రధాని ఇందిరా గాంధీని అనర్హులుగా ప్రకటించినట్లు గుర్తు చేశారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Mar 18 2024, 10:42

రెండో రోజు కవితను విచారించనున్న ఈడీ

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితను ఇవాళ రెండో రోజు ఈడీ విచారించనుంది.

నేడు విచారణకు రావాల్సిం దిగా కవిత భర్త అనిల్‌తో పాటు ఆమె వ్యక్తిగత సిబ్బం దిలో ముగ్గురికి ఈడీ నోటీ సులు ఇచ్చింది.

సీజ్ చేసిన ఫోన్లను ఓపెన్ చేయడంతో పాటు మద్యం పాలసీకి సంబంధించిన పలు అంశాలపై వారిని ప్రశ్నించనున్నట్లు సమా చారం.

కాగా కవిత అరెస్టును సవాల్‌ చేస్తూ ఇవాళ ఆమె భర్త అనిల్‌ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనున్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Mar 18 2024, 10:40

నేడు జగిత్యాలలో విజయ సంకల్ప సభ: హాజరు కానున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ

తెలంగాణ ఎంపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ నేడు జగిత్యాలలో జరగనున్న విజయ సంకల్ప సభకు హాజరు కానున్నారు. జగిత్యాలలోని గీతా విద్యా లయ గ్రౌండ్‌లో ఈ సభకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్త య్యాయి.

ఉదయం 11.15 గంటలకు జగిత్యాలకు ప్రధాని మోడీ చేరుకోనున్నారు. ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు సభలో మోడీ పాల్గొననున్నారు.

సభ అనంతరం హైదరా బాద్ చేరుకుని మోడీ ఢిల్లీకి బయల్దేరి వెళ్లనున్నారు. ప్రధాని మోడీ సభ సందర్భంగా బందోబస్తుకు 1600 మందిని పోలీసులు మోహరించారు..

తప్పు చేస్తే దొరకక తప్పదు

Mar 15 2024, 08:25

ముఖ్యమంత్రి నుదిటి పై గాయం :ఆస్పత్రికి తరలింపు

పశ్చిమ బెంగాల్ ముఖ్య మంత్రి మమతా బెనర్జీ గురువారం సాయంత్రం ప్రమాదానికి గురయ్యారు. ఆమె నుదిటిపై తీవ్ర గాయాలయ్యాయి.

దీంతో ముఖ్యమంత్రిని హుటాహుటిన సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎక్స్ వేదికగా తెలిపింది.

ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా షేర్ చేసింది. ఆమె నుదుటిపై గాటు పడగా, ముఖంపై రక్తం కారుతున్న దృశ్యా లను ఆ ఫొటోలో కనిపించాయి.

మమత ఇంట్లో గాయపడ్డా రని తెలుస్తోంది. వెంటనే కోల్‌కతాలోని ఎస్ఎస్‌కేఎం ఆసుపత్రికి తరలించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

మమతా బెనర్జీకి పెద్ద గాయమైందని.. ఆమె త్వరగా కోలుకోవాలని అందరూ ప్రార్థించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నట్లు టీఎంసీ ఎక్స్‌లో పేర్కొంది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Mar 15 2024, 07:56

తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో స్పల్ప భూప్రకంపనలు

ఏపీలోని తిరుపతి, నెల్లూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో స్పల్పంగా భూప్రకంపనలు సంభవించాయి.

నెల్లూరు జిల్లాలోని నాయుడుపేట, ఓజిలి, దొరవారిసత్రం, పెళ్లకూరు మండలాలలో స్వల్పంగా భూప్రకంపనలు చోటుచే సుకున్నాయి

తిరుపతి జిల్లాలోని దొరవారిసత్రంలో భూమి కంపించింది. రెండు మూడు సెకన్ల పాటు భూమి కంపించింది.

దీంతో ప్రజలు భయాం దోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. సమాచారం తెలుసుకున్న అధికారులు ఈ భూప్రకంపనలపై ఆరా తీస్తున్నారు...